రుద్రూర్, మార్చి 12 : మండలంలోని సులేమాన్నగర్లో ఉన్న బసవేశ్వరాలయం వద్ద అభివృద్ధి పనులు చురుకుగా కొనసాగుతున్నాయి.
సభాపతి సహకారంతో ఆలయం వద్ద డైనింగ్ హాల్ నిర్మాణ పనులు చేపట్టినట్లు ఆలయ అర్చకుడు పరమేశ్వర్ మహరాజ్ తెలిపారు. డైనింగ్ హాల్ నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ తరఫున స్పీకర్కు కృతజ్ఞతలు తెలిపారు.