నస్రుల్లాబాద్ / బాన్సువాడ రూరల్/ కోటగిరి, సెప్టెంబర్ 8:కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఆలయాల అభివృద్ధి జరుగుతుందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తిమార్గంలో నడవాలని సూచించారు. ధర్మాన్ని మనం కాపాడితే.. దేవుడు కూడా అన్ని రకాలుగా మనల్ని కాపాడుతాడని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పలు మండలాల్లో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్పీకర్ స్వ గ్రామం బాన్సువాడ మండలం పోచారంలో నూ తనంగా నిర్మించిన శ్రీ సీతారామాలయంలో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో జగదాంబ సేవాలాల్ ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. పాత పొతంగల్ గ్రామంలో రూ.30 లక్షలతో చేపట్టనున్న హనుమాన్ ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. రూ.15లక్షలతో నిర్మించిన హనుమన్ మందిరం కమ్యూనిటీ హాలును ప్రా రంభించారు.
అనంతరం హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ఆలయాల నిర్మాణంలో మనం సేవకులం మాత్రమే అని, మిగిలినదంతా భగవంతుడి ఇచ్ఛ అని పేర్కొన్నారు. ఆలయాల నిర్మాణంతో రాజ్యం సుభిక్షం గా ఉంటుందన్నారు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని, మన రాష్ట్రంలో మాత్రం పుష్కలంగా పంటలు పండిస్తూ ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలన్నారు. భక్తిమార్గంలో నడిస్తే అంతా మంచే జరుగుతుందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఆలయాల కోసం రూ.150 కోట్లు మం జూరు చేసినట్లు తెలిపారు. పాత పొతంగల్లో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నా యకుడు పోచారం సురేందర్రెడ్డి, స్థానిక సర్పంచ్ వర్ని శంకర్, వైస్ ఎంపీపీ మర్కెల్ గంగాధర్పటేల్, విండో చైర్మన్ శాంతేశ్వర్పటేల్, మాణికప్పా, గంట్ల విఠల్, కాశాగౌడ్,పవన్, ప్రకాశ్, బీఆర్ఎస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.