-కలెక్టర్ జితేశ్ వీ పాటిల్
కామారెడ్డి, ఏప్రిల్ 16: మహనీయుల త్యాగాల ఫలితంగా స్వేచ్చా వాయువులు పీల్చగలుగుతున్నామని, వారి త్యాగాలు వృథా కాకుండా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించి ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి డిగ్రీ కళాశాలలో ‘శక్తి వంతమైన ప్రజాస్వామ్యంలో ఓటరు భాగస్వామ్యం’ అనే అంశంపై స్వీప్, పొలిటికల్ సైన్స్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఒక రోజు వర్క్ షాప్లో కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకంగా వీవీ ప్యాట్ ద్వారా ఓటు వినియోగం తెలుసుకోవడంతోపాటు పకడ్బందీ వ్యవస్థతో 12 గంటల్లో ఫలితాలు వెల్లడిస్తున్నామని అన్నారు. అనంతరం ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఆర్డీవో రఘునాథరావు, స్వీప్ అధికారి వెంకటేశ్వర్లు, కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్, ప్రొఫెసర్లు కిష్టయ్య, చంద్రశేఖర్ పాల్గొన్నారు.