ఎండలు భగ్గున మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రోజురోజుకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వారం రోజులుగా భానుడు భగభగ మండుతుండడంతో మధ్యాహ్న సమయాల్లో జనాలు ఇండ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో జిల్లా కేంద్రంతోపాటు పలు పట్టణాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసరమైతే గొడుగులు, క్యాప్లు, స్కార్ఫ్లు ధరించి బయటికి వస్తున్నారు. ఎండవేడిమిని భరించలేక జ్యూస్లు, నిమ్మరసాలను సేవిస్తూ ఉపశమనం పొందుతున్నారు. ఇండ్లల్లో ఉండేవారు కూలర్లు, ఫ్యాన్ల కింద సేదతీరుతున్నారు.
కామారెడ్డి జిల్లాలో వారంలో రోజుల నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు గాంధారిలో అత్యధికంగా 42.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బిచ్కుందలో 41.8, ఎల్పుగొండ 41.7,డోంగ్లీ 41.7,పిట్లం 41.6, పాత రాజంపేట 41.4, పెద్దకొడప్గల్ 40.6, జుక్కల్ 40.6, దోమకొండ 40.6, మెన్నూర్ 40.1, బొమ్మన్దేవునిపల్లి 40.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, అత్యల్పంగా గాంధారి మండలం రామలక్ష్మణపల్లిలో 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా ఎండలు మండుతున్నాయి. తాజాగా ఎడపల్లి మండల కేంద్రంలో అత్యధికంగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి 28న మోపాల్ మండలంలో 42.0 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశముందన్న వాతావరణ నిపుణల హెచ్చరికలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు
అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రా వాలి. ఎండ తీవ్రంగా ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించా లి. పిల్లలు, గర్భిణులు, వృద్ధు లు, దీర్ఘకాలిక రోగులు బయటికి రావొద్దు. జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉం చాం. బస్టాండ్, రైల్వేస్టేషన్, ప్రధాన కూడళ్ల వద్ద ప్రాథమిక చికిత్స అందించడానికి ఆశ కార్యకర్తలు అందుబాటులో ఉంటారు.