ఉమ్మడి జిల్లాలో దత్త జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయాల్లో ప్రత్యేక పూజలు కొనసాగాయి. ఆలయాలకు భక్తులకు పోటెత్తారు. పంచామృత అభిషేకాలు, గణపతి హోమం, గురు చరిత్ర పారాయణం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన దత్త జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు