నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేయడంపై దళిత నేతలు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం బాన్సువాడలో సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కటౌట్లకు క్షీరాభిషేకం చేశారు.
ముఖ్యమంత్రి దళిత పక్షపాతి అని, దళితబంధు పథకమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్రం పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలని వారు డిమాండ్ చేశారు.