కామారెడ్డి/రాజంపేట్, ఫిబ్రవరి 25 : కామారెడ్డి జిల్లాలోని దళిత బంధు లబ్ధిదారులు ఆదివారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు.
దళిత బంధుకు ఎంపికైన లబ్ధిదారులకు నిధులు విడుదల చేయాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో స్వామి, రవీందర్, నర్సింహులు, రాజు తదితరులు పాల్గొన్నారు.