నిజాంసాగర్/ ఖలీల్వాడి, జూలై 11: తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ను జడ్పీ మాజీ చైర్మన్లు దఫేదార్ రాజు, దాదన్నగారి విఠల్రావు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొనసాగుతున్న ‘ఎస్ఐఆర్’ ప్రక్రియపై చర్చించారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు సమయన్వయంతో సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేయాలని కేటీఆర్ సూచించినట్లు జడ్పీ మాజీ చైర్మన్లు తెలిపారు.
కేటీఆర్ సూచనల మేరకు ఓటరు నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకొని ముందుకు సాగుతామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ బి.శ్రీనివాస్రావు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.