అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ. లక్షలోపు రుణమాఫీ చేసి రైతుపక్షపాతిగా నిలిచింది. ఇప్పటికే రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తున్నది. రూ.లక్షలోపు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయడంతో అన్నదాతల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కరోనా వంటి విపత్కర పరిస్థితులతో ఎన్ని అడ్డంకులు ఎదురైనా రైతు సంక్షేమ పథకాలను ఎన్నడూ ఆపలేదని.. ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతు పక్షపాతి అయిన సీఎం కేసీఆర్కు వెంటే ఉంటామంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు.
వ్యవసాయం పండగే ..
ఎల్లారెడ్డి రూరల్ : వ్యవసాయం దండుగ అనే పరిస్థితి నుంచి వ్యవసాయం పండుగ అనే పరిస్థితి కల్పించారు సీఎం కేసీఆర్. నేను బ్యాంకులో పంట కోసం తీసుకున్న రుణం రూ.57వేలు ఉంది. సీఎం ప్రకటించిన ప్రకారం ప్రస్తుతం రుణం మొత్తం మాఫీ అవు తుంది. రైతులకు ఇంతకన్నా సంతోషం ఇంకేం ఉంది.
-జక్కుల యాదగిరి, రైతు, ఎల్లారెడ్డి
రైతుపై కేసీఆర్ ప్రేమకు నిదర్శనం
కమ్మర్పల్లి : రుణ మాఫీ అమలువుతుండడం కేసీఆర్కు రైతు పై ఉన్న ప్రేమ నిదర్శనం. కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ప్రభావం పడి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా రైతు సంక్షేమ కార్యక్ర మాలను కేసీఆర్ ఆపలేదు. లక్షలోపు వరకు రుణ మాఫీని చేర్చి ఇచ్చిన మాట మీద నిలబడ్డారు.
-పార్శపు శ్రీకాంత్, యువ రైతు, కమ్మర్పల్లి