కామారెడ్డి, డిసెంబర్ 15 : పోలీసులు తక్షణమే స్పందించడంతో ఓ నిండు ప్రాణం నిలిచింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్ శివారులో నేషనల్ హైవే సమీపంలో పంట పొలాల్లో కాసర్ల నర్సింహులు అనే వ్యక్తి ట్రాక్టర్తో గురువారం పొలం దున్నుతున్నా డు. ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో సీట్లోనే కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో ఎస్సై భూమ య్య ఆధ్వర్యంలో హైవేపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. వంశీ అనే వ్యక్తి వారి వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని వివరించాడు. వెంటనే పోలీసులు నర్సింహులు వద్దకు వెళ్లారు.
సురేశ్ అనే కానిస్టేబుల్ సీపీఆర్ చేశాడు. నర్సింహులు స్పృహలోకి రాగానే పొలం వద్ద నుంచి పెట్రోలింగ్ వాహనం వరకు హుస్సేన్ అనే కానిసేబుల్ భుజంపై వేసుకొని తరలించాడు. అనంతరం పెట్రోలింగ్ వాహనంలో దవాఖానకు తరలించారు. తక్షణమే స్పందించి వ్యక్తి ప్రాణాలను కాపాడిన హైవే పెట్రోలింగ్ ఎస్సై భూమయ్య, కానిస్టేబుల్ సురేశ్, హుస్సేన్ను జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ అభినందించారు