సమైక్య పాలనలో సర్వం నష్టపోయిన రైతులు ఇప్పుడు హాయిగా బతుకుతున్నారు. స్వరాష్ట్రంలో దర్జాగా పంటలు పండిస్తున్నారు. ఫుళ్లు నీళ్లు, నిరంతర విద్యుత్తో సాగులో స్వయం సమృద్ధి సాధిస్తున్నారు. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో
వ్యవసాయం బాగుపడింది. ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో అన్నదాతలకు రంది లేకుండా పోయింది. అయితే, విద్యుత్, ధరణి వంటి వాటిపై కాంగ్రెస్ చేస్తున్న ప్రకటనలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. 24 గంటల కరెంట్ వృథా అని, మూడు గంటలే చాలని హస్తం నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అన్నదాతలను కలవరపెడుతున్నాయి. పైగా ఇప్పుడున్న మోటర్ల స్థానంలో 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలని ఉచిత సలహా ఇస్తుండడంతో రైతులు అయోమయంలో పడ్డారు. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చీకటి రోజులు మళ్లీ వస్తాయని ఆందోళనకు గురవుతున్నారు. అందుకే ఎన్నికల్లో ఆగమాగం కాకుండా ఆలోచించి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. హస్తం వద్దు.. రైతు నేస్తం కేసీఆర్ ముద్దు అని రైతులంతా నినదిస్తున్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఉద్యమ నాయకుడికే తమ మద్దతు అని బహిరంగంగానే చెబుతున్నారు. దళారుల రాజ్యం తెచ్చేందుకు ధరణిని ఎత్తేస్తామంటున్న కాంగ్రెస్కు తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేస్తున్నారు
మూడు గంటల కరెంటు సరిపోతది అంటున్న కాంగ్రెసోళ్ల మాటలకు రైతులు మోస పోవద్దు. ఎందుకంటే పదేండ్ల కిందట కరెంటుతోని ఎన్నో కష్టాలు చూశాం. ఒక్క గుంట నీళ్లు పారంగనే కరెంటు పోతుండె. కరెంటు ఎప్పుడస్తుండెనో తెల్వకుండె. కరెంటు వచ్చినంక మోటర్ ఏస్తే.. తడిసిన గుంటనే మళ్లీ పారుతుండె. సగం పండుతుండె.. సగం ఎండుతుండె. పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాక ఎన్ని అప్పులైతుండె. అప్పుల బాధకు ఎంతమంది రైతులు ఉరేసుకున్నరు. కాంగ్రెస్ పార్టీతో గోసవడ్డ రోజులు ఇంకా మర్చిపోలేదు. మళ్లీ 3 గంటల కరెంటు.. 10 ఎస్పర్ మోటర్లు అని రెవంత్రెడ్డి రైతులకు కొత్త ముచ్చట్లు చెప్తుండు. కాంగ్రెస్ను నమ్ముకుంటే రైతులను నిండా ముంచుతడు. రాత్రి కరెంటు.. పొద్దున కరెంటు అని ముప్పుతిప్పలు పెడ్తరు. రైతులు పొరపాటున కూడా కాంగ్రెస్ను తెచ్చి నెత్తిన పెట్టుకోవద్దు. కేసీఆర్ సార్ మంచిగా కరెంటు ఇస్తుండు. బాధ లేకుండా పంటలు పండిస్తున్నం. బీఆర్ఎస్ సర్కారు వస్తేనే రైతులకు మంచిది.
రేవంత్రెడ్డి 3 గంటల కరెంటు ఇస్తామంటున్నడు. కరెంటు ఎప్పుడొస్తదో.. ఎప్పడు పోతదో తెల్వదు. ఇక నీళ్లు పారియ్యాలంటే పోలాల్లోనే పండుకోవాలె. కరెంటు కష్టాలను రైతులు కొని తెచ్చుకోరు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తుంది. రైతులకు కరెంటు బాధలైతే లేవు. ఎప్పడు కావాలంటే అప్పుడు పొలానికి పోయి నీళ్లు పారిస్తున్నం. మిగితా పనులు కూడా చేసుకుంటున్నం. చదుకునే విద్యార్థులుకూడా బడి, కాలేజ్ నుంచి వచ్చాక సాయంత్రంపూట పొలానికి పోయి నీళ్లు పారిస్తున్నరు. వేళాపాలా లేని కరెంటుతో ఎన్ని కష్టాలుంటయ్.. ఇతర పనులన్నీ వదులుకొని రాత్రింబవళ్లూ కరెంటు కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులు చాలా కష్టాలు చూడాల్సి వస్తుంది.
రైతులంటే కాంగ్రెస్కు అంత అలుసా? వ్యవసాయానికి ఇచ్చే కరెంటుతోనే రేవంత్రెడ్డి ఆటలాడు కుంటాడా? కాంగ్రెస్ పాలనలో ఎన్ని కష్టాలు పెట్టారో చూడలేదా? మళ్లీ మామీద పడి కష్టపెట్టాలని చూస్తున్నరా? మీకు చేతనైతే మేలు చేసే పథకాలు ఇస్తామనండి. కానీ 3 గంటలే కరెంటిస్తం.. 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోండి.. అంటే కాంగ్రెస్ను, రేవంత్రెడ్డిని బొందవెడ్తం. రైతుబిడ్డగా సీఎం కేసీఆర్కు రైతుల కష్టాలు ఎంటో తెలుసు. అందుకే 24 గంటల కరెంట్ ఇస్తున్నడు. పెట్టుబడి ఇస్తున్నడు. పంటలు కొంటున్నడు. బీమా ఇస్తున్నడు. వీటన్నింటినీ వదులుకొని ఎవడైనా రేవంత్రెడ్డికి జై కొడతాడా? కాంగ్రెస్ పార్టీ అంటేనే కరెంటు కష్టాలని అందరికీ తెలుసు.
వ్యవసాయంపై అవగాహన లేకుండా మాట్లాడొద్దు. పొలంలో దిగితే తెలుస్తుంది… పంటలు పండించడమంటే ఎంత కష్టమో. కాంగ్రెస్ హయాంలో కరెంటు ఉంటే.. నీళ్లు ఉండకుండె.. నీళ్లుంటే.. కరెంటు రాకపోతుండె. ఇప్పుడు మళ్లీ 3 గంటల కరెంటుతో రైతులు అవే కష్టాలు చూడాలా? మోటర్ ఎంతసేపు నడిపిస్తే ఎంత భూమి పారుతుందనే విషయం రేవంత్రెడ్డికి అసలు తెలుసా? 10 హెచ్పీ మోటర్లు పెట్టి నీళ్లు గుంజితే.. మళ్లీ వారం దాకా బోరులోకి నీళ్లురావు. 3 గంటల కరెంటుతో మూడు పూటలు తోటకూ.. ఊళ్లేకు మర్రాలె. రేవంత్రెడ్డి ఇలాంటి తమాషాలతో మంచిగున్న రైతులను చెడగొట్టాలని చూస్తున్నడు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటేనే రైతు మరింత బాగుపడతాడు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవసాయం గురించి తెల్వకుండ మాట్లాడుతున్నడు. మూడు గంటల కరెంటు ఇస్తడంట.. 10 హెపీ మోటర్లు పెట్టుకోవాల్నంట. ఉన్న మోటర్లను పీకేసి కొత్తగా లక్షల పెట్టుబడితో కొత్త మోటర్లు కొనాలంటే.. పైసల్ రేవంతం ఇస్తడా? 3 గంటల కరెంటు అంటున్నడు.. రాత్రి ఇస్తాడో? పగలిస్తాడో? పొలాలకు పోయి అక్కడనే పండుకోవాలె. లేదంటే ఎవుసం మానేయాలె. రైతుల మీద కరెంటు పిడుగు వేద్దామని చూస్తున్నరు. ఇలాంటి నాయకులను గెలిపిస్తే మళ్లీ పాత కష్టాలే చూడాల్సి వస్తుంది. మంచిగున్న ఎవుసాన్ని ఖరాబ్ చేసుకునుడే. బీఆర్ఎస్ సర్కారు నీళ్లు తెచ్చింది. ఫ్రీగా 24 గంటల కరెంటు ఇస్తున్నది. తెలివి ఉన్నోడు ఇంత మంచి సౌలత్ను వద్దనుకుంటడా? కాంగ్రెస్తోని మళ్లీ కష్టాలు తెచ్చుకుంటడా?
రైతులకు సీఎం కేసీఆర్ 24 గంటలపాటు ఫ్రీగా కరెంటు ఇస్తున్నడు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రేవంత్రెడ్డి 3 గంటలే కరెంట్ ఇస్తడంట. తెలివి ఉన్నోడు ఎవడైనా మంచిగున్న కరెంటును పాడుచేసుకుంటడా? రైతులకు మంచి చేస్తున్న కేసీఆర్ను వదులుకొని.. కష్టపెట్టే కాంగ్రెస్ను తెచ్చుకుంటరా? పదేండ్ల నుంచి ఎలాంటి బాధలు లేకుండా హాయిగా పంటలు పండిస్తున్నం. మోటర్లు కాలిపోతలేవ్. పొలాలు ఎండిపోతలేవ్. ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి నీళ్లు పారిస్తున్నం. వేరే పనులు కూడా చేసుకుంటున్నం. 3 గంటల కరెంటు.. 10 హెచ్పీ మోటర్లు పెట్టుకొని ఎవుసాన్ని పాడు చేసుకుంటమా? మళ్లీ మొదటి నుంచి లక్షల్లో పెడ్డుబడి పెట్టి వ్యవసాయం చేయాలంటే రైతులతోని అయితదా? కాంగ్రెస్ను నమ్మడం కన్నా చావడం మేలు.
కరెంట్తోనే పంటలకు నీళ్లందుతాయి. లేకుంటే కాలువలతో పంటలకు సరిపడా నీళ్లు ఇవ్వాలి. కాంగ్రెస్ ఇస్తే గిస్తే కష్టాలిస్తది.. కానీ కరెంట్ ఇవ్వదు. నీళ్లు ఇవ్వదు. కాంగ్రెస్ వస్తే 10 హెచ్పీ మోటర్లు కొనుక్కొని, కరెంటు లేక.. జనరేటర్లు కొనుక్కొని, డీజిల్ పోసి పొలంలో దిగాల్సి ఉంటది. ఇంత భారం పేద రైతులు మోస్తరా? మళ్లీ కష్టాల్లోకి నెట్టే పాలసీలు చేసే పార్టీలు మాకు అవసరం లేదు. రేవంత్రెడ్డి ముందుగా పొలాలకు పోయి.. వ్యవసాయం గురించి తెలుసుకోవాలి. కొంచమన్నా తెలివి పెంచుకుంటే రైతులకు ఏంగావాల్నో తెలుస్తుంది. 10 హెచ్పీ మోటర్లతో ఎంత భారమో అర్థమవుతుంది. 3 గంటల కరెంటుతో ఎన్ని తిప్పలో బుర్ర కెక్కుతుంది. ఆ తర్వాత మాట్లాడితే బాగుంటది. మాకు కాంగ్రెస్ వద్దూ.. రేవంతం వద్దూ.. ఆ కష్టాలు వద్దు. రైతులను కేసీఆర్ సర్కారు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది.
మూడు గంటల కరెంటు, 10 హెచ్పీ మోటర్లతో ఎవుసాన్ని ఆగం చేసుకునుడే. లక్షల రూపాయలు పెట్టుబడి కావాలె. మళ్లీ అప్పులు చేయాలి. గట్టుమీద ఉన్న రైతు బురదలో మునిగిపోతాడు. మూడు గంటలే కరెంటు ఇస్తామంటున్నరు. ఆ మూడు గంటల కోసం ఎప్పుడస్తదోనని ఎదురు చూసుకుంటూ కూర్చోవాలె. అప్పుడు మోటర్లు ఆన్ చేసుకోవాలి. లోడ్ ఎక్కువైతే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతయ్.. మోటర్లు పోతయ్.. మళ్లా రిపేర్లకు పైసల్ కావాలె. చారాణా కోడికి.. బారాణా మసాలా అయితది. ఇగ ఏం బాగువడ్తం. కేసీఆర్ సర్కారు రైతులను తిప్పలు పెట్టకుండా 24 గంటల కరెంటు ఇస్తున్నది. ఎప్పుడు తడి లేకపోతే అప్పుడు నీళ్లు పారించుకోవచ్చు. మోటర్లు కూడా కాలిపోతలేవు. కాంగ్రెస్ను తెచ్చుకొని మంచిగున్న బతుకులను ఆగం చేసుకోం.