కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇందులోభాగంగా పార్టీ ఆధ్వర్యంలో ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమాన్ని శుక్రవారం ఏర్పాటు చేయగా.. ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జాజాల సురేందర్ తదితరులు తరలివెళ్లారు. బరాజ్ను అణువణువు పరిశీలించి వాస్తవాలను ప్రజలు, మీడియాకు వివరించారు.