కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సిలిండర్ను రూ. 500కే ఇస్తామని ప్రకటించింది. కేవైసీ అప్డేట్ ఉంటేనే ఈ ధర వర్తిస్తుందని, ఆదాయ ధ్రువ పత్రం ఉంటేనే మహాలక్ష్మి పథకం అందుతుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీలు, మీ సేవ కేంద్రాల వద్ద కేవైసీ అప్డేట్ కోసం, ఇన్కం సర్టిఫికెట్ల కోసం బారులు తీరుతున్నారు. కాగా ప్రభుత్వ పథకాలకు కేవైసీ అప్డేట్కు ఎలాంటి సంబంధం లేదని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు.