బాన్సువాడ, డిసెంబర్ 11 : ఎమ్మెల్యేగా మరోసారి విజయం సాధించిన తర్వాత తొలిసారి బాన్సువాడ పట్టణానికి విచ్చేసిన పోచారం శ్రీనివాస రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు, అభిమానులు, అధికారులు బారులు తీరారు. ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛాలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ పోచారం ధన్యవాదాలు తెలిపారు. ఉదయం బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలోని తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. బాన్సువాడ పట్టణంలోని జ్ఞాన సరస్వతీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం సోదరీమణి సత్యవ్వ, బావ విఠల్ రెడ్డి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.