కంఠేశ్వర్, జనవరి 22: ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 39 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, జడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో చందర్, డీపీవో జయసుధ, ఆర్డీవో రాజేంద్రకుమార్కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
జాతీయ బాలికల దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని స్త్రీ శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో సోమవారం బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంపై జిల్లా అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఆడపిల్లలను రక్షిద్దాం – వారిని చదివిద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు అంకితభావంతో కృషిచేస్తామని జిల్లా అధికారులు ప్రతిజ్ఞ చేస్తూ సంతకాలు చేశారు.