ఇటీవల ప్రకటించిన సివిల్స్లో విజేతగా నిలిచి అఖిల భారత సర్వీస్లకు ఎంపికైన బోధన్ పట్టణానికి చెందిన కె.మహేశ్కుమార్ను కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సోమవారం తన చాంబర్లో అభినందించారు. మహేశ్ కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం, సివిల్స్ కోసం సన్నద్ధమైన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అత్యుత్తమ స్థాయిలో 200 ర్యాంకు సాధించడం ఎంతో గొప్ప విషయమని ప్రశంసించారు. మహేశ్కు మిఠాయి తినిపించి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో సుదర్శనం, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కిషన్ తదితరులు ఉన్నారు.
-ఖలీల్వాడీ, మే 29