Indiramma houses | కామారెడ్డి బిబిపేట్ (దోమకొండ )ఏప్రిల్ 26 : అర్హత కలిగిన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. దోమకొండ మండల కేంద్రంలోని షేక్ అల్మా బేగం-సద్దాం పాషా ఇంటిని కలెక్టర్ శనివారం పరిశీలించారు. తాను, తన భర్త కూలీ పనిచేస్తూ ఇద్దరు పిల్లల కుటుంబాలతో నివసిస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్ ను వేడుకున్నారు.
ప్రస్తుతం ఉన్న ప్లాస్టిక్ కవర్స్ లతో కప్పబడి ఉన్న ఇంటిలో గత 20 సంవత్సరాల నుండి నివసిస్తున్నామని, తనకున్న ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకుంటానని తెలిపారు. ప్రభుత్వమిచ్చే రూ.5 లక్షలతో పాటు ఇతర మార్గాల ద్వారా ఇల్లు నిర్మించుకుంటానని ఆ దంపతులు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారిని జ్యోతి ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు