రాజంపేట్, మార్చి 1: ప్రాచీన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. రాజంపేట మండలకేంద్రంలోని మెట్ల బావిని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
శిథిలావస్థకు చేరిన మెట్లబావిని దాతల సహకారంతో బాగు చేయిస్తామన్నారు. పూడిక తీసేందుకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.