కామారెడ్డి, ఫిబ్రవరి 22: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు జిల్లాకు చెందిన 19,509 మంది విద్యార్థులు హాజరుకానున్నారని,
పరీక్షల నిర్వహణకు 37 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. సమావేశంలో ఇంటర్మీడియెట్ నోడల్ అధికారి షేల్ సలాం, పరీక్షల విభాగం అధికారులు పాల్గొన్నారు.