జక్రాన్పల్లి: మండలంలోని జక్రాన్పల్లి, పడకల్ గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పలువురు లబ్ధిదారులకు ఆర్థిక సాయం కింద మంజూరైన చెక్కులను మంగళవారం ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. జక్రాన్పల్లిలో గ్రామానికి చెందిన కావ్యకు రూ.40వేలు, నర్సయ్యకు రూ.28వేలు, సంజయ్కి రూ.28వేలు, బొరవ్వకు రూ.14వేలు, రాజన్నకు రూ.14వేలు మంజూరైన చెక్కులను అందజేశారు.
పడకల్ గ్రామంలో వడ్ల రాజేశ్వర్కు రూ.60వేలు, కాటిపాపల గంగుకు రూ.46వేలు, అరుణ్కు రూ.28వేలు, లోక గంగుకు రూ.20వేలు, దశరథ్కు రూ.16వేలు, శ్రీరాజ్కు రూ.14వేలు మంజూరు అయ్యాయి. ఈ సందర్భంగా నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జక్రాన్పల్లి సర్పంచ్ చంద్రకళ, ఉపసర్పంచ్ బాలకిషన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నట్ట భోజన్న, ఎంపీటీసీ సభ్యులు గంగారెడ్డి, సతీశ్, సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు అక్బర్ ఖాన్, లబ్ధిదారులు, పడకల్ సర్పంచ్ పుప్పాల శ్రీనివాస్, ఎంపీటీసీ గంగారెడ్డి, ఉపసర్పంచ్ రుతిక్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రాజేశ్వర్గౌడ్, ఉపాధ్యక్షుడు గంగాధర్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.