సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అంబరాన్నంటాయి. రక్తదానాలు, సామాజిక సేవా కార్యక్రమాలతో పండుగ వాతావరణం నెలకొన్నది. హైదరాబాద్లో సీఎం కేసీఆర్ను కలిసి ఎమ్మెల్యే జీవన్రెడ్డి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మొక్కలను నాటారు.
కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. బిచ్కుందలో ఎమ్మెల్యే హన్మంత్ షిండే, బాణాపూర్లో ఎమ్మెల్యే జాజాల సురేందర్ వేడుకల్లో పాల్గొన్నారు.