భీమ్గల్లో వంద పడకల దవాఖాన.. పేదలకు వరం
కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకంలో మంత్రి వేముల
భీమ్గల్, మే 26 : ఒకప్పడు కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగా ఉండేదని, ప్రస్తుతం సీఎం కేసీఆర్ నిరుపేదల ఆరోగ్యమే ప్రధానంగా రూ. వందల కోట్లు వెచ్చించి అత్యాధునిక దవాఖానలను అందుబాటులోకి తీసుకువస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో వంద పడకల ప్రభుత్వ దవాఖానను మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి గురువారం మంత్రి క్షీరాభిషేకం చేశారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వంద పడకల దవాఖాన తన హయాంలో మంజూరుకావడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్కు బా ల్కొండ నియోజకవర్గ ప్రజలంటే అత్యంత ప్రే మ అన్నారు. ఉద్యమసమయం నుంచి రైతునాయకుడు దివంగత వేముల సురేందర్రెడ్డి కేసీఆర్కు సన్నిహితంగా ఉండడంతో ఈ ప్రాంత కష్టనష్టాలు వారికి బాగా తెలుసన్నారు.
అందుకే చెక్డ్యాములు, ఎత్తిపోతల పథకాలు, రోడ్లు, వంద పడకల దవాఖాన ఇలా ఏది అడిగినా కాదనకుండా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్కు రుణపడి ఉంటానని అన్నారు. దవాఖాన మం జూరుపై ప్రత్యేక శ్రద్ధచూపిన ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు ధన్యవాదాలు తెలిపారు. వీలైనం త త్వరగా దవాఖాన నిర్మాణం పూర్తి చేసి పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఆతృత ఉందన్నారు. వారం, పది రోజుల్లో ఆరోగ్యశాఖ మంత్రితో కలిసి భూమిపూజ చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత, జడ్పీటీసీ చౌట్పల్లి రవి, వైస్చైర్మన్ భగత్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యులు గుణ్వీర్రెడ్డి, ము ల్క గంగాధర్, కౌన్సిలర్లు ధరావత్ లింగయ్య, మూత లత, నర్సయ్య, గంగాధర్, ఖైరున్నీసాబేగం, సతీశ్గౌడ్, మల్లెల రాజశ్రీ, తుమ్మ భూదేవి, షమీమ్ బేగం, మల్లెల అనుపమ, కో-ఆప్షన్ సభ్యులు అజ్మత్, నవీన్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అనుబంధ కమి టీ అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.