ఎడపల్లి/ ఏర్గట్ల/ బాల్కొండ/ ఆర్మూర్టౌన్/ మాక్లూర్/ ఇండల్వాయి, మార్చి 21: గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ఎంతో ముఖ్యమైని సీడీపీవో జానకమ్మ అన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో సీడీపీవో జానకమ్మ, సూపర్వైజర్ విజయరాణి ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాలు గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం గంగామణి, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. పోషకాహర వారోత్సవాల్లో భాగంగా ఏర్గట్ల మండలంలోని తొర్తి అంగన్వాడీ కేంద్రంలో వారోత్సవాలను నిర్వహించారు. సూపర్వైజర్ నాగలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు సీమంతం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు ప్రేమలత, శైలజ పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో ఫ్రీ స్కూల్ కార్యక్రమంలో భాగంగా పోషకాహారం కార్డులను అందజేసి తల్లిపాల ప్రాముఖ్యతపై సూపర్వైజర్ శ్రీదేవి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో చిట్టాపూర్, బోదేపల్లి, వన్నెల్(బి), అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నార.
ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించామని సూపర్వైజర్ వెంకట రమణమ్మ తెలిపారు. మాక్లూర్ మండలంలోని కల్లడి, డీకంపల్లి అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారంపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. ఎంపీడివో జైక్రాంతి మాట్లాడారు. అనంతరం ప్రీ స్కూల్ పిల్లల అభివృద్ధి కార్డులను తల్లిదండ్రులకు అందజేశారు. కార్యక్రమంలో సూపర్వైజర్ సునిత, జీపీ కార్యదర్శి చంద్రశేఖర్, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. ఇందల్వాయి మండలంలోని లోలం గ్రామంలో ఉన్న రైతువేదికలో మండల స్థాయి పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ స్వర్ణలత పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణులకు సామూహిక సీమతం, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో మండల విస్తీర్ణాధికారి శంకర్, సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.