డిచ్పల్లి, ఫిబ్రవరి 4: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభా కళాశాల ధర్మారం(బీ)లో ఆదివారం నిర్వహించిన టీఎస్డబ్ల్యూఆర్ సీవోఈ సెట్-2024 ప్రశాంతంగా ముగిసినట్లు కోఆర్డినేటర్ బి.సంగీత తెలిపారు.
ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించగా, మొత్తం 504 మంది విద్యార్థులకు 494 మంది హాజరు కాగా 10 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలోని ఆరు కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించగా 2747 మంది విద్యార్థులకు 2659 మంది హాజరుకాగా 88 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.