బోధన్, ఏప్రిల్ 16: బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మరో మారు మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఈ నెల 24న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ తెలిపారు. ఛత్రపతి శంభాజీ నగర్లో సభ ఏర్పాట్లపై ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్తో కలిసి ఆదివారం సమావేశమయ్యారు.
అక్కడి మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ జాదవ్, మహారాష్ట్ర కిసాన్సెల్ అధ్యక్షుడు మాణిక్ కదం తదితరులతో కలిసి చర్చించారు. అనంతరం సమావేశం వివరాలు, బీఆర్ఎస్ హయాంలో చేపట్టబోయే కార్యక్రమాలు, సంక్షేమ ఫలాల గురించి బోధన్ ఎమ్మెల్యే వెల్లడించారు. సమావేశంలో ఐడీసీ చైర్మన్ వేణుగోపాల్, బీఆర్ఎస్ నాయకులు ఖదీర్ మౌలానా తదితరులు పలువురు పాల్గొన్నారు.