కోటగిరి/ జనవరి 27 : స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై బీజేపీ నాయకుడు మాల్యాద్రిరెడ్డి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. బాన్సువాడ నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
రాష్ట్రంలో బాన్సువాడ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి.. బీజేపీ నాయకుడు మాల్యాద్రిరెడ్డి కంటికి కనిపించడం లేదా..? అని కోటగిరి మాజీ వైస్ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. కోటగిరిలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. మాల్యాద్రిరెడ్డి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషిచేస్తున్న స్పీకర్పై ఆరోపణలు చేసే అర్హత మాల్యాద్రిరెడ్డికి లేదన్నారు. స్పీకర్పై మరోసారి విమర్శలు చేస్తే నియోజకరవ్గంలో తిరగనివ్వబోమని హెచ్చరించారు. సొంత పనుల కోసం వారానికి ఐదు రోజులు హైదరాబాద్లో ఉండే మాల్యాద్రిరెడ్డికి నియోజకవర్గ అభివృద్ధి గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. సమావేశంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ అధ్యక్షుడు కిశోర్బాబు, కన్వీనర్ ఎజాజ్ఖాన్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, ఏఎంసీ వైస్ చైర్మన్ రాంరెడ్డి, ఎత్తొండ సర్పంచ్ సాయిబాబా, ఎంపీటీసీ అనంత విఠల్, విండో అధ్యక్షుడు కూచి సిద్ధు, ఎత్తొండ మాజీ సర్పంచ్ ఆనంద్, బేగరి రాములు, కన్నం దావులయ్య, జుబేర్ పాల్గొన్నారు.
మత రాజకీయాలు మాని క్రమశిక్షణ నేర్చుకో..
రుద్రూర్, జనవరి 27 : మత రాజకీయాలు మాని, క్రమశిక్షణ నేర్చుకోవాలని మాల్యాద్రిరెడ్డికి రుద్రూర్ జడ్పీటీసీ సభ్యుడు నారోజి గంగారాం హితవు పలికారు. రుద్రూర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వయస్సులో పెద్ద అని చూడకుండా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ మాట్లాడుతూ.. కోచింగ్ సెంటర్ల పేరుతో పలువురిని మోసం చేశావని ఆరోపించారు. అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ఇసుక మాఫియా అని మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ సాయిలు, మండల కార్యదర్శి బాలరాజు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సంగయ్య, విండో చైర్మన్ సంజీవ్రెడ్డి, పార్టీ శాఖ అధ్యక్షుడు తొట్ల గంగారాం, నాయకుడు అక్కపల్లి నాగేందర్, సర్పంచులు పాల్గొన్నారు.
నియోజకవర్గంలో ఎక్కడా లేని అభివృద్ధి..
చందూర్, జనవరి 27 : బాన్సువాడ నియోజకవర్గంలో ఎక్కడా లేని అభివృద్ధి చేస్తున్న స్పీకర్ పోచారంపై వార్డు మెంబర్గా గెలువలేని మాల్యాద్రిరెడ్డి విమర్శలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ చందూర్ నాయకులు అన్నారు. మరోసారి స్పీకర్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మూడ్ అంబర్సింగ్, నాయకులు కర్లం సాయారెడ్డి, బొడ్డోళ్ల సత్యనారాయణ, దేవీసింగ్, ప్యారం అశోక్ తదితరులు పాల్గొన్నారు.
మాల్యాద్రిరెడ్డి నోరు అదుపులో పెట్టుకో..
మోస్రా (చందూర్), జనవరి 27 : నోరు అదుపులో పెట్టుకోవాలని మల్యాద్రిరెడ్డికి మోస్రా మండల బీఆర్ఎస్ నాయకులు సూచించారు. మోస్రాలో బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధి కనబడుతుంటే.. యువతను పక్కదోవ పట్టిస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, పిట్ల ఉమాశ్రీరాములు, వంగ సాయాగౌడ్, విమలాలింగయ్య, సున్నం భూమయ్య, నరేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ మనుగడ కోసమే..
కోటగిరి, జనవరి 27 : బాన్సువాడ నియోజకవర్గంలో రాజకీయ మనుగడ కోసమే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై మాల్యాద్రిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని వర్ని మండల బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీ నాయకులు ఇచ్చిన బాన్సువాడ బంద్ విఫలమైందనే అక్కసుతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీనియర్ నాయకుడు మేక వీర్రాజు, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సింగంపల్లి గంగారాం, సహకార సంఘం అధ్యక్షుడు నామాల సాయిబాబా, సర్పంచులు సత్తిబాబు, శ్రీనగర్ రాజు, మైసం వెంకటేశ్వర్లు, నాయకులు ఎంబడి నాగభూషణం పాల్గొన్నారు.