లోక్సభ ఎన్నికల పోరులో బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తున్నది. నిజామాబాద్ లోక్సభ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ అన్ని పార్టీల కన్నా ప్రచారంలో ముందున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయనను అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే నియోజకవర్గాన్ని చుట్టివచ్చారు. ఇటీవలే నామినేషన్ కూడా దాఖలు చేసిన ఆయన.. మరింత జోరు పెంచనున్నారు. ఇందులో భాగంగా బాజిరెడ్డికి మద్దతుగా ఊరూరా ప్రచారం చేసేందుకు గులాబీ రథాలు సిద్ధమయ్యాయి.