బోధన్, అక్టోబర్ 29: స్థానిక ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా ఆధ్వర్యంలో పట్టణంలో ఆదివారం ఎమ్మెల్యే నివాసం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీ అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మరోమారు రావాలని నినాదాలు చేస్తూ స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్కు మద్దతుగా నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, స్థానిక ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ద్వారా సాధించిన అభివృద్ధి పనులు, స్వచ్ఛంద కార్యక్రమాలపై కళాబృందాలు ప్రదర్శనలు నిర్వహించాయి. ర్యాలీలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహ్మద్ ఎహెతెషాం (సోహైల్), బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బెంజర్ గంగారాం, సీనియర్ నాయకులు ఆబేద్ అహ్మద్ సోఫీ, బీఆర్ఎస్ రైతు కమిటీ పట్టణ అధ్యక్షుడు నక్క లింగారెడ్డి, అబ్బగోని గంగాధర్ గౌడ్, పెరిక స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఎడపల్లి, అక్టోబర్ 29: మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే సతీమణి ఆయేషా ఫాతిమా జానకంపేట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మ్యానిఫెస్టో అంశాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు.
బోధన్ రూరల్, అక్టోబర్ 29:సాలూరా మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకుడు బుద్దె రాజేశ్వర్, బోధన్ ఏఎంసీ వైస్ చైర్మన్ మహ్మద్ షకీల్ (సాలూరా), సాయిలు, జనార్దన్ పాల్గొన్నారు.
నవీపేట,అక్టోబర్ 29: మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్కు మద్దతుగా బీఆర్ఎస్ బూత్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వి.నర్సింగ్రావు, సీనియర్ నాయకుడు తెడ్డు పోశెట్టి, బూత్ కమిటీలు మైనార్టీ మహిళలతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. కార్యక్రమంలో బి.సూరిబాబు, ఎంపీటీసీ మీనా నవీన్రాజ్, డాంగే సతీశ్ పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ ఫకీల్కు మద్దతుగా ఉంటామని ధర్యాపూర్ తండా గిరిజనులు ప్రమాణం చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని ధర్యాపూర్ తండాకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వి.నర్సింగ్రావు, సీనియర్ నాయకుడు తెడ్డు పోశెట్టి, స్థానిక ఎంపీటీసీ డాంగే సతీశ్తో కలిసి ప్రచారానికి వెళ్లారు. తండా వాసులు గ్రామంలోని సేవాలాల్ మందిరంలో సమావేశమయ్యారు. గ్రామ గిరిజన సంఘం ప్రతినిధులు బన్సీనాయక్, భీంరావు నాయకత్వంలో ప్రమాణం చేశారు. ఏకగ్రీవ తీర్మానం చేశారు. కార్యక్రమంలో బంజారా సంఘం గ్రామ అధ్యక్షుడు బన్సీనాయక్ తదితరులు పాల్గొన్నారు.
కోటగిరి, అక్టోబర్ 29 : జిల్లాలో బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకున్నది. నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరిస్తున్నారు. ఉమ్మడి కోటగిరి మండలంలోని ఆయా గ్రామాల్లో ఆదివారం బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి తరఫున నాయకులు, కార్యకర్తలు ఇంటింట ప్రచారం చేశారు. పోచారాన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఖలీల్వాడి నగరంలోని అన్ని డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జిలు, కార్యకర్తలు బిగాల గణేశ్ గుప్తా గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
మెండోరా,అక్టోబర్ 29:పోచంపాడ్ అమ్రాయికాలనీలో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేస్తామని అమ్రాయి కాలనీ వాసులు తెలిపారు. సర్పంచ్ మిస్బా , ఎంపీటీసీ జాన్బాబు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.