Chukkapur temple | మాచారెడ్డి : మండలంలోని చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో రోజైన శనివారం ఉదయం సేవా కాలం, ప్రబోధ కి శాంతి పాఠం ద్వారా తోరణ పూజలు చచుస్థానార్చన మూల మంత్ర హవనములు నవ కలశ స్నపనం ఉత్సవమూర్తులకు పంచామృతాలు పండ్లరసాలతో అభిషేక కార్యక్రమం పూర్ణాహుతి తీర్థప్రసాద వితరణ మొదలగు కార్యక్రమంలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్,ఈవో శ్రీధర్ రావు వేద పండితులు అర్చకులు డైరెక్టర్లు లక్ష్మీరాజం ఆంజనేయులు బాల్ రెడ్డి జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్ మరియు సిబ్బంది వివిధ గ్రామాలలో నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.