కస్టమ్ మిల్లింగ్ రైస్లో ఎలాంటి తప్పులు చేయలేదని బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పష్టం చేశారు. కావాలనే తనను, రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రకు పాల్పడుతున్నారన్నారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే ఉరిశిక్షకు సైతం సిద్ధమన్నారు. గ్రాము బియ్యం కూడా దుర్వినియోగం కాలేదని అధికారుల విచారణలో తేలిందన్నారు.
బోధన్, జనవరి 16 : నిజాయితీగా ప్రజలకు సేవచేస్తూ, తన కుటుంబ పోషణకు రైస్మిల్లును నడుపుతూ రైతుల్లో ఎంతో పేరు తెచ్చుకుంటున్న తన ను, రైతు పక్షపాతిగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా బద్నాం చేసేందుకే ఒక ప్రముఖ పత్రికలో బోధన్ మండలంలోని తన రైస్మిల్లుపై అవాస్తవమైన, అబద్ధపు వార్తను ప్రచురించారని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ధ్వజమెత్తారు. ఒక కుట్ర ప్రకారం ఆ పత్రికలో తనపై అభాండాలు మోపుతూ, నూటికి నూరుశాతం అబద్ధపు వార్తను ప్రచురించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటువంటి బ్లాక్ మెయిలింగ్ కుట్రను ఛేదించి, తన రైస్మిల్లుపై తప్పుడు వార్తను రాసినందుకుగాను చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల ఒక పత్రికలో ఎమ్మెల్యే షకీల్కు చెందిన రైస్మిల్లు కస్టమ్ మిల్లింగ్కు సంబంధించి అక్రమాలకు పాల్పడిదంటూ కథనం రావడంపై ఆయన తీవ్రంగా స్పందించారు.
ఈ మేరకు సోమవారం బోధన్ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి ఇందుకు సంబంధించిన వాస్తవాలను మీడియా ముందు ఉంచారు. రూపా యి పెట్టుబడి లేకుండా తాను రైస్మిల్లులను పెట్టానని, రూ.120 కోట్ల కస్టమ్ మిల్లింగ్ ధాన్యానికి సంబంధించి మోసం చేశానని ఆ పత్రికలో కథనం ప్రచురించారని, ఇందులో ఒక శాతం నిజమున్నా.. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బహిరంగంగా ఉరిశిక్షకు సిద్ధమని షకీల్ సవాల్ విసిరారు.తనను అప్రతిష్టపాలు చేసేలా ఈ కథనం రావడంతో తీవ్రమైన ఆవేదనకు గురయ్యాయని, తెలంగాణలో ఇబ్బడిముబ్బడిగా ధాన్యం ఉత్పత్తి జరగడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రంలోని రైస్ మిల్లర్లు సైతం తీవ్రమైన మనోవేదనకు గురయ్యారని అన్నారు. తనపై కథనం వచ్చిన వెంటనే తన రైస్మిల్లుకు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్పై విచారణ జరపాలని, కలెక్టర్, ఇతర జిల్లా ఉన్నతాధికారులకు స్వయంగా తానే ఫోన్చేసి కోరానన్నారు. తన కోరికమేరకు సం క్రాంతి సెలవులు ఉన్నప్పటికీ, కలెక్టర్ ఆరు విజిలెన్స్ బృందాలను పంపించి మూడు రోజులపాటు విచారణ జరిపించారన్నారు.
ఈ విచారణలో ఒక గ్రాము కస్టమ్ ధాన్యం, బియ్యం దుర్వినియోగం కాలేదని అధికారుల విచారణలో తేలిందన్నారు. ఆ పత్రికలో వచ్చిన తప్పుడు వార్తపై తాను తొందరపడి ఖండించలేదని, అధికారులతో విచారణ జరిపించి, వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ పత్రిక తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నానన్నారు. జిల్లా అధికారులు ఇచ్చిన నివేదిక వివరాలను ఎమ్మెల్యే షకీల్ విలేకరులకు చూపుతూ.. ఈ నివేదిక ఆధారంగానే ఆ పత్రిక దురుద్దేశపూరితగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఆ వార్తను ప్రచురించిందన్న నిర్ధారణకు వచ్చానన్నారు. ఆ పత్రికలో వార్తను ఎవరూ రాయించారు.. ఏ విలేకరి ఏ ఉద్దేశంతో రాశాడన్న వివరాలు తన వద్ద ఉన్నాయ ని, వారి ఫోన్ డాటాను కూడా సేకరించామని అ న్నారు. బ్లాక్ మెయిలింగ్కు పాల్పడే వ్యక్తులను క్షమించే ప్రసక్తిలేదన్నారు. ఒక్క రూపాయి లేకుండా రైస్మిల్లులు పెట్టానని రాశారని, ఇది ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు.
కస్టమ్ మిల్లింగ్కు సంబంధించి ఇవీ వాస్తవాలు:
విలేకరుల సమావేశంలో అధికారిక నివేదికలను ఉటంకిస్తూ.. గత ఏడాది ఖరీఫ్కు సంబంధించి అన్ని రైస్ మిల్లుల కన్నా ముందే తాను కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించానని ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. గత ఖరీఫ్లో తనకు అలాట్ చేసిన ధాన్యంలో 96 శాతం కస్టమ్ మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి అప్పగించినట్లు తెలిపారు. ఆ తర్వాత రబీ సీజన్కు సంబంధించి 14 శాతం కస్టమ్ బియ్యాన్ని అప్పగించాల్సి ఉండగా, తమ రైస్మిల్లు నుంచి 11 శాతం అప్పగించామన్నారు. మిగతా 3 శాతం కూడా ఇవ్వడానికి తాము సిద్ధపడగా, గోదాములు ఖాళీలేక ప్రభు త్వం తీసుకోలేదన్నారు.తన రైస్మిల్లు వ్యాపారానికి సంబంధించి ఒక్క శాతం తప్పును కూడా ఎత్తిచూపలేరన్నారు. ఎవరైనా, ఎప్పుడైనా తన రైస్మిల్లు కు వచ్చి తనిఖీలు చేసుకోవచ్చని, రికార్డులు చూడవచ్చని అన్నారు.
బోధన్ నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా, తాను రైస్మిల్లులు పెట్టిన ట్లు తెలిపారు. రైస్మిల్లును నడపడమంటే.. ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. ఎన్నో వ్యయ, ప్ర యాసాలను రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్నారన్నా రు. అనేక మంది రైస్మిల్లర్లు రైస్ మిల్లులను నడపడానికి తమజేబుల్లోంచి ఖర్చు పెడుతున్నారని, రైస్ మిల్లర్లు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి, రైతులకు వారధిగా ఉంటూ రైస్ మిల్లర్లు ఎంతో క్రియాశీలక పాత్ర వహిస్తున్నారన్నారు. ఆ పత్రికలో వచ్చిన వార్త రైస్ మిల్లర్ల మనోైస్థెర్యాన్ని దెబ్బతీసిందని, కొందరు వ్యక్తులు రైస్ మిల్లర్లను బ్లాక్ మెయిలింగ్ చేస్తూ వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా చొరవచూసి రైస్ మిల్లర్ల ఇబ్బందులను తీర్చాలని షకీల్ కోరారు.
బియ్యం వ్యాపారం నాకు కొత్త కాదు:
2014 నుంచి తాను ఎమ్మెల్యేగా ఉన్నానని, అంతకుముందు పదేండ్ల కిందటి నుంచే తాను బియ్యం వ్యాపారం చేస్తున్నానని ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. విదేశాలకు బియ్యం ఎగుమతిదారుడిగా తనకు పేరుందని గుర్తుచేశారు. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని తాను ఈ దందా చేయడంలేదన్నారు. ఒక కిలో తరుగు లేకుండా తమ రైస్మిల్లు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. తెలంగాణాలో ఎన్నడూ లేనంతగా ధాన్యం ఉత్పత్తి జరగడంతో.. రైస్ మిల్లులపై భారం పెరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గోదాములు నిర్మించినప్పటికీ బియ్యం నిల్వలకు అవి సరిపోవడంలేదన్నారు. తమ రైస్మిల్లు కోసం జగిత్యాల, కోరుట్ల ప్రాంతాల నుంచి అక్కడి రైతుల కోరిక మేరకు ధాన్యం సేకరించామన్నారు.
ఇలా, నిజాయితీగా, ఏమాత్రం అక్రమాలకు పాల్పడకుండా రైస్ వ్యాపారం చేస్తున్న తమపై కుట్రపూరితంగా నింద లు వేయడాన్ని ప్రజలు సహించబోరని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో బోధన్ వ్యవసా య మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు దేశా య్, జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ రజితా యాదవ్, ఎడపల్లి ఎంపీపీ శ్రీనివాస్, బోధన్ వైస్ ఎంపీపీ కోట గంగారెడ్డి, బీఆర్ఎస్ బోధన్ నియోజకవర్గ నాయకులు నర్సింగ్రావు, గోగినేని నరేంద్రబాబు, సిర్ప సుదర్శన్, గుమ్ముల అశోక్రెడ్డి, నాగన్పల్లి మధు, నక్క లింగారెడ్డి, వినోద్ నాయక్, జక్క సంజు పటేల్, ఎం.ఎ.భారీ పాల్గొన్నారు.