ఖలీల్వాడీ/ఆర్మూర్, జూన్ 27 : ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల పరిధిలో టీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో మంగళవారం రక్తదాన శిబిరాలు నిర్వహించారు. నిజామాబాద్ ఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిబిరంలో మొత్తం 51 మంది రక్తదానం చేశారని అధికారులు తెలిపారు. రక్తదానం చేసిన వారికి పండ్లు, పండ్ల రసాలను జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు సిబ్బంది అందజేశారు. కార్యక్రమంలో శంకర్, ఆనంద్, వెంకటేశ్వర్లు, పద్మజ, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఆర్మూర్ డిపోలో..
ఆర్మూర్, జూన్ 27: ఆర్మూర్ ఆర్టీసీ డిపోలో డీఎం కవిత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ ఎస్హెచ్వో సురేశ్బాబు ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో ఆర్టీసీ కార్మికులు, ఇతరులు కలిసి మొత్తం 65 మంది రక్తదానం చేశారు. అనంతరం రక్తదానం చేసిన వారికి పండ్ల రసాలు, పండ్లను అందజేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బి ఆంజనేయులు, ఆర్మూర్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, ఎంఎఫ్ గంగాకిషన్, ఎస్టీఐ పారు, వెల్ఫేర్ సొసైటీ సభ్యులు నాగేశ్వర్, డీవీఎస్ చక్రవర్తి, రవి, సైమన్, కొడిచర్ల నర్సయ్య , రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ మాజీ అధ్యక్షుడు పిప్రికర్ పుష్పాకర్రావు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బోధన్లో..
బోధన్, జూన్ 27: బోధన్ ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ విద్య రాణ్వాల్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని సూచించారు. రక్తదానంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఒకరి రక్తదానంతో ముగ్గురి ప్రాణాలు నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి రక్తం ఎంతో అవసరమని అన్నారు. బోధన్లోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ బ్లడ్బ్యాంక్ వారి సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించగా.. 25 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. రక్తదాతలకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు, యూబీఐ వారు పండ్లు, బిస్కెట్లు అందజేశారు. కార్యక్రమంలో దవాఖాన ఆర్ఎంవో డాక్టర్ రహీం, డిపో మేనేజర్ టీఎన్ స్వామి, వెల్ఫేర్ బోర్డు మెంబర్స్ శ్రీనివాస్, సావిత్రి, అసిస్టెంట్ మేనేజర్ జానాబాయి, అసిస్టెంట్ మెకానికల్ మేనేజర్ హరిప్రసాద్, బోధన్ దవాఖాన సూపర్ వైజర్ నిర్మల, బ్లడ్బ్యాంక్ ఇన్చార్జి సాజీదా బేగం, ల్యాబ్ టెక్నీషియన్ కిరణ్తో పాటు పలువురు పాల్గొన్నారు.