డిచ్పల్లి, జనవరి 9 : బీఆర్ఎస్లో వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారు. మండలంలోని ఖిల్లా డిచ్పల్లి ఎంపీటీసీ భర్త లొక్కిడి సాయితోపాటు పలువురు సోమవారం రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి బాజిరెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ నియంతృత్వ పోకడలు నచ్చక బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడినై పార్టీలో చేరినట్లు లొక్కిడి సాయి ఈ సందర్భంగా పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి బాజిరెడ్డి గోవర్ధన్తోనే సాధ్యమన్నారు. బీఆర్ఎస్లో చేరినవారిలో లొక్కిడి సాయితోపాటు బీజేపీ యువజన విభాగం నాయకులు కార్తీక్, శ్రీకాంత్ ఉన్నారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు దండుగుల సాయిలు, సీనియర్ నాయకులు శక్కరికొండ కృష్ణ, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మోహన్రెడ్డి, బీఆర్ఎస్ మండల ఎస్టీసెల్ అధ్యక్షుడు విఠల్ రాథోడ్ పాల్గొన్నారు.