ఖలీల్వాడి, జనవరి 6 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం కింద చేపట్టిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులు వెంటనే జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు.
శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘మన ఊరు – మన బడి’, స్వయం సహాయక సం ఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పం పిణీ, తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు, హరితహారం, పల్లెప్రకృతి, మినీ బృహత్ పల్లెప్రకృతి వనా లు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో మండలాల వారీ గా సమీక్ష నిర్వహించారు. మండలంలో కనీసం రెండు పాఠశాలల్లో తక్షణమే పనులను పూర్తి చే యించి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేసి ఉంచాలని ఆదేశించారు. పలు పాఠశాలల్లో నిర్దేశిత పనులు పూర్తయినప్పటికీ బిల్లులు చెల్లించడంలో జాప్యం నెలకొనడంపై కలెక్టర్ అసహనం వ్యక్తంచేశారు. నిధులు సిద్ధంగా ఉన్నా పనులు చేసిన ఏజెన్సీలకు బిల్లులు చెల్లించడంలో ఎందుకు ఆలస్యమవుతోందని సం బంధిత ఏఈలపై ఒకింత ఆగ్రహం వ్యక్తంచేశారు.
వెంటనే ఎఫ్టీవోలు జనరేట్ చేసి బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాల్సిందిగా పదేపదే చెబుతున్నప్పటికీ అలసత్వం ప్రదర్శిస్తున్నారని పలువురిని మందలించారు. వచ్చే బుధవారం నాటికి పరిస్థితిలో మార్పు రావాలన్నారు. తీరు మార్చుకోని వారిపై సస్పెన్షన్ వేటు వేస్తామని హెచ్చరించారు. అన్ని జీపీలు, ఆవాస ప్రాం తాల్లో సంక్రాంతి నాటికి తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
మినీ బృహత్ పల్లెప్రకృతి వనాల ఏర్పాటు, నిర్వహణలో నిర్లక్ష్యానికి తావిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని పలు మండలాల ఏపీవోలను కలెక్టర్ హెచ్చరించారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీలో మరింత ప్రగతి సాధించాలని సూచించారు. వీసీలో జడ్పీ సీఈవో గోవింద్, డీపీవో జయసుధ, మెప్మా పీడీ రాములు, జిల్లా కార్మికశాఖ అధికారి యోహాన్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు దేవీదాస్, భావన్న, మురళి పాల్గొన్నారు.