రుద్రూర్, డిసెంబర్ 9 : మండలంలోని అక్బర్నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూం కాలనీలో వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రూ. 25 లక్షలు మంజూరు చేశారని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తున్న స్పీకర్కు కృతజ్ఞతలు తెలిపారు. డబుల్బెడ్ రూం గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు.
రుద్రూర్ మండలకేంద్రంలో మూడు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి పోచారం సురేందర్రెడ్డి భూమిపూజ చేశారు. ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్రూమును అందించడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం పథకాన్ని అమలుచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అక్కపల్లి సుజాతా నాగేందర్, జడ్పీటీసీ సభ్యుడు నారోజి గంగారాం, వైస్ ఎంపీపీ సాయిలు, డీఈ నాగేశ్వర్రావు, మిషన్ భగీరథ ఏఈ అజయ్, సర్పంచ్ గంగామణీ ప్రసాద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి బాలరాజు, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సంగయ్య, రామాగౌడ్, సంజీవ్, రుద్రూర్ గ్రామశాఖ అధ్యక్షుడు తొట్ల గంగారాం, పట్టెపు రాములు తదితరులు పాల్గొన్నారు.