విద్యానగర్/కామారెడ్డిరూరల్/బీబీపేట్/మాచారెడ్డి/భిక్కనూ ర్/దోమకొండ/తాడ్వాయి, సెప్టెంబర్ 25 : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలను ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులోని ధర్మశాలలో, విద్యానగర్లోని సాయిబాబా ఆలయంలో, పంచముఖీ హనుమాన్ ఆలయంలో, అశోక్ నగర్లో, పలు వీధుల్లో మహిళలు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం నీటి కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
కామారెడ్డి మండలంలోని ఆయా గ్రామాల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయం నుంచి రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సాయంత్రం ఆయా గ్రామాల్లోని ప్రదాన కూడళ్ల వద్ద ఉంచి ఆడిపాడారు.
మండలంలోని గర్గుల క్యాసంపల్లి, నర్సన్నపల్లి, కొటాల్పల్లి, గూడెం తదితర గ్రామాల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దోమకొండ, తాడ్వాయి, బీబీపేట్, మాందాపూర్, జనగామ, యాడారం, ఇస్సానగర్, తుజాల్పూర్, మాల్కాపూర్, శేరీ బీబీపేట తదితర గ్రామాల్లో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. మాచారెడ్డితోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. కొన్ని గ్రామాల్లో ఇంటిలోని కుండీలతోపాటు సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు. భిక్కనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబురాలను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. అందంగా పేర్చిన బతుకమ్మలు, పాటలు పాడిన విద్యార్థులకు జాగృతి యూత్ విభాగం అధ్యక్షుడు శ్రీరాంవెంకటేశ్ బహుమతులను ప్రదానం చేశాడు. కార్యక్రమంలో సభ్యులు ప్రవీణ్, రజిత, మనీశ్రెడ్డి, ప్రమోద్, రాజు, సంతోష్ పాల్గొన్నారు.