భీమ్గల్/ మోర్తాడ్, సెప్టెంబర్ 21: బాల్కొండ నియోజక వర్గంలో రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా కుల సంఘాల ఏకగ్రీవ మద్దతు తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రికి విశేష ఆదరణ లభిస్తోందనడానికి ఈ తీర్మానాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
మంత్రి వేములకు మద్దతుగా నియోజక వర్గంలో ప్రతి రోజూ కుల సంఘాల ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా గురువారం భీమ్గల్ మండలం పురాణి పేట్లో కుర్మ సంఘం, మెండోరా గ్రామ ఎస్సీ మాల సంఘ సభ్యులు, మోర్తాడ్ మండలం పాలెంలో ముదిరాజ్ సంఘాల సభ్యులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ వెంటే ఉంటామని ఏకగ్రీవ తీర్మానాలు చేసుకొన్నారు.ఈ మేరకు తీర్మానాల కాపీలను ఆయా గ్రామాలు,మండలాల బీఆర్ఎస్ నాయకులకు అందజేశారు.