బాల్కొండ, నవంబర్ 17 : బాల్కొండ నియోజకవర్గానికి ఫైర్ స్టేషన్ (అగ్నిమాపక కేంద్రం)ను ప్రభుత్వం మంజూరు చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా బాల్కొం డ మండల కేంద్రంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఆధ్వర్యంలో గురువారం సీఎం కేసీఆర్, రాష్ట్ర రోడ్లు భవ నాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల మండలాల అధ్యక్షులు మాట్లాడారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని నియోజకవర్గానికి రెండో అగ్నిమాపక కేంద్రాన్ని మంజూరు చేయడం సంతోషకరమన్నారు. నాలుగు మండలాల ప్రజల తరఫున సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఏదైనా ప్రమా దం జరిగినప్పుడు దగ్గరలోనే అగ్నిమాపక కేంద్రం ఉండడంతో ప్రమాదాలు, ఆస్తి నష్టం జరగకుండా ఉంటుందన్నారు.
యావత్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని, ఇందుకు ఇటీవల మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షులు బద్దం ప్రవీణ్రెడ్డి, ముస్కు భూమేశ్వర్రెడ్డి, నాగంపేట్ శేఖర్రెడ్డి, ఎం పీపీలు లావణ్య, పద్మ, సుకన్య, జడ్పీటీసీ సభ్యు లు బద్దం నర్సవ్వ, తలారి గంగాధర్, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, తౌటు గంగాధర్, పుప్పాల విద్యాసాగర్, సాగర్ యాదవ్, నాగులపల్లి రాజేశ్వర్, నవీన్గౌడ్, సొసైటీ చైర్మన్లు నాగులపల్లి సూరజ్రెడ్డి, జక్క రాజేశ్వర్, నోముల రవి, మానేటి నాగభూషణం, మామిడి రాకేశ్, కన్న పో శెట్టి, ఈపీ. నారాయణ, సయ్యద్ ఫయాజ్ అలీ, షేక్ వాహబ్, శ్రీనివాస్గౌడ్, శ్రీకాంత్చారి, సీహె చ్.కిషన్, మహ్మద్ ఇఫ్తాకారోద్దీన్, ఎంఎ. షాహీద్, డాక్టర్ ప్రసాద్గౌడ్, మజారోద్దీన్, గాండ్ల రాజేశ్, రియాజ్అలీ, ముర ళి, గడ్డం మహేశ్, గాండ్ల హరీ శ్, లక్ష్మీ నారాయణ, జక్క రాజారెడ్డి నాయకులు పాల్గొన్నారు.
నందిపేట్లో కేసీఆర్, జీవన్రెడ్డి చిత్రపటాలకు..
నందిపేట్, నవంబర్ 17 : నందిపేట్ మండల కేంద్రానికి ఫైర్ స్టేషన్ మంజూరుపై టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, మండల కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ హుస్సేన్, ఉపసర్పంచ్ భరత్, నాయకులు సిలిండర్ లింగం, ముత్యం, అహ్మద్ హుస్సే న్, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.