Baji Reddy Jagan | సిరికొండ, మార్చి 14 : సిరికొండ మండలంలోని న్యావనంది గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ చంద్రకాంత్ సత్యమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించింది. ఆ బాధిత కుటుంబాన్ని శనివారం బీఆర్ఎస్ రూరల్ నియోజకవర్గం ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతురాలి కుటుంబ సభ్యులకు పార్టీ అన్ని రకాల అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ తోటరాజన్న, మాజీ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ రమేష్, నాయకులు ఆకుల తిరుమల్, రాజ్ పాల్, గంగారెడ్డి, సురేందర్ పాల్గొన్నారు.