ఎల్లారెడ్డి, మార్చి 16 : పెండ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆటోబోల్తాపడి ఇద్దరు మృతి చెందారు. పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన లింగంపేట మండలం బాయంపల్లి వద్ద శనివారం చోటుచేసుకున్నది. నిజాంసాగర్ మండలంలోని సింగీతం, గున్కుల్, వడ్డెపల్లి గ్రామాలకు చెంది న 11 మంది లింగంపేట మండలం కోర్పోల్ గ్రామంలో ఓ పెండ్లికి ఆటో లో వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా బాయంపల్లి వద్ద ఆటో అదుపు తప్పి గుంతలోకి వెళ్లి పడిపోయింది.
ఈ ప్రమాదంలో సింగీతం గ్రామానికి చెందిన సంగయ్య (66) అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రం గా గాయపడిన లాలవ్వ(50)ను దవాఖానకు తరలించగా అక్కడ చనిపోయింది. ప్రమాదంలో గున్కుల్ గ్రామానికి చెందిన ఏడుగురు పెద్దలు, ముగ్గురు పిల్లలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో బాలమణి, సతీశ్, సాయవ్వ, పోచవ్వ, కవిత ఉన్నారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు.