భిక్కనూరు, ఏప్రిల్ 3: ఆలయంలో చోరీకి వచ్చిన ఓ దొంగ హుండీ నుంచి సొమ్మును కాజేయడానికి యత్నించి అక్కడే ఇరుక్కుపోయాడు. హుండీలో తన ఎడమ చేయి ఇరుక్కోవడంతో రాత్రంతా అక్కడే ఉండిపోయాడు. స్థానిక ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. భిక్కనూరు మండలం రామేశ్వర్పల్లికి చెందిన సురేశ్ స్థానిక మాసుపల్లె పోశమ్మ ఆలయంలో పనిచేస్తున్నాడు.
దుర్బుద్ధి పుట్టడంతో సురేశ్ సోమవారం రాత్రి ఆలయం ముందు ఉన్న హుండీపై భాగాన్ని ధ్వంసం చేశాడు. హుండీలో నుంచి డబ్బులను తీసుకునేందుకు లోపల ఎడమ చేయి పెట్టగా అందులోనే ఇరుక్కుపోయింది. దీంతో రాత్రంతా అలాగే ఉండిపోగా.. మంగళవారం ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు, గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. చోరీకి యత్నించిన సురేశ్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదుచేసినట్లు ఎస్సై తెలిపారు.