ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో ఉన్న యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆంధ్రాబ్యాంకు) గోడకు గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి కన్నెం వేశారు. ఆర్మూర్ పోలీసులు, బ్యాంకు మేనేజర్ కార్తీక్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎప్పటిలాగానే శనివారం రాత్రి బ్యాంకుకు తాళం వేసి సోమవారం ఉదయం 10 గంటలకు బ్యాంకు అధికారులు బ్యాంకును తెరిచారు. గుర్తు తెలియని దుండగులు బ్యాంకు వెనుక భాగంలోని గోడకు కన్నెం వేసి చోరీ చేసేందుకు ప్రయత్నించారు.
బ్యాంకులోని లాకర్ను పగలగొట్టడానికి విశ్వప్రయత్నం చేశారు. బ్యాంకు మేనేజర్ కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో సైదేశ్వర్ తెలిపారు. బ్యాంక్లో చోరీ యత్నానికి పాల్పడిన సంఘటనపై క్లూస్ టీం బృందం సభ్యులు విచారణ చేపట్టారు.