బీబీపేట్(దోమకొండ) : కామారెడ్డి ( Kamareddy ) జిల్లా దోమకొండ మండల ఆర్చరీ నేషనల్ పోటీలకు (Archery competitions ) గడికోటకి చెందిన ఆర్చరీ క్రీడాకారులు నలుగురు జాతీయ క్రీడా పోటీలకు ఎంపికైనట్లు కోచ్ ప్రతాప్ దాస్ తెలిపారు. కొల్లూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 2న జరిగిన రాష్ట్ర స్థాయి మినీ చాంపియన్ పోటీల్లో మంచి ప్రతిభ చూపిన (రికర్వ్ అండర్ -15విభాగంలో) బి ఇందు, అండర్ -13 విభాగంలో వర్షిణి, (ఇండియన్ అండర్ -12విభాగంలో) డి అకుల్ , రమ్య ఎంపికయ్యారని వెల్లడించారు.
ఈ నెల 22 నుంచి 28 వరకు గుంటూరులో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు పాల్గొంటారని వివరించారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా ఆర్చరీ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు అనిల్ కామినేని, జిల్లా అధ్యక్షులు తిర్మల్ గౌడ్, కార్యదర్శి మోహన్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, కార్యదర్శి నర్సింహా రెడ్డి, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు సీతారాం మధు, మండల అధికారులు, నాయకులు అభినందించారు.