బాల్కొండ, ఏప్రిల్ 8:ప్రజలు మత్తుపదార్థాలకు బానిసలై బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఏఎస్సై శంకర్ అన్నారు. శనివారం చిట్టాపూర్లో మత్తుపదార్థాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచించచారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని అన్నారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఏటీఎం పిన్, బ్యాంకు ఖాతా వివరాలు చెప్పవద్దని అన్నారు. ఫోన్లో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని చెప్పారు. గంజాయి, పేకాటను నిర్మూలించేందుకు యువత సహకరించాలని కోరారు. యువత ఒక లక్ష్యంతో ముందుకు సాగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. చెరువులు, కుంటల వద్ద సైన్బోర్డు ఏర్పాటు చేయాలని గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, బీఆర్ఎస్ నాయకుడు గోవర్ధన్గౌడ్ పాల్గొన్నారు.