డిచ్పల్లి/ ఇందల్వాయి, సెప్టెంబర్ 4 : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరుచేసిన పెన్షన్లకు సంబంధించిన మంజూరు పత్రాలు, ఐడీ కార్డులను లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు, నాయకులు ఆదివారం పంపిణీ చేశారు. డిచ్పల్లి మండలంలోని కొలిప్యాక్లో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు మంజూరుపత్రాలు, కార్డులను మాజీ ఎంపీపీ డీకొండ హరిత అందజేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు డీకొండ శ్రీనివాస్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బాలయ్య పాల్గొన్నారు.
ఇందల్వాయి మండలంలోని చంద్రాయన్పల్లిలో లబ్ధిదారులకు ఎంపీపీ రమేశ్ నాయక్ ఆసరా పెన్షన్లకు సంబంధించిన మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లలితా గంగదాస్, ఉపసర్పంచ్ ప్రకాశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలువేరి గంగదాస్, నాయకులు గంగారెడ్డి, రఘు, వీడీసీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.