శక్కర్నగర్ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట డివిజన్లోని సబ్ స్టేషన్లలో ఈ విధులు నిర్వహిస్తున్న ఆర్టిజెన్లు నిరవేదిక సమ్మెను ( Artisans Dharna ) చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టిజన్ల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సుజాయిత్ అలీ, బోధన్ సంఘ నాయకుడు ఆరిఫ్ ఖాన్, బోధన్ చైర్మన్ రవి కిరణ్ తదితరులు మాట్లాడారు. బీఆర్ఎస్ ( BRS ) ప్రభుత్వ హయాంలో ఆర్టిజెన్లను విద్యుత్ శాఖలో విలీనం చేశారని తెలిపారు.
తమ హక్కుల విషయంలో ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్హతల ఆధారంగా తమకు పదోన్నతులు కల్పించాలని, 24 గంటలు విధులు నిర్వహిస్తున్న తమను ఉద్యోగులుగా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేటికి ఆర్టిజన్లకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించలేకపోయారని ఆరోపించారు.
తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేవరకు, రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు సమ్మెను కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవ్ కుమార్, ధనుంజయ్, వహీద్, గణేష్ లతోపాటు డివిజన్లోని సబ్స్టేషన్లకు చెందిన ఆర్టిజన్లు పాల్గొన్నారు.