Appropriate recognition for the BC leader
డిచ్పల్లి : నిజామాబాద్ రూరల్ శాసన సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) చైర్మన్గా నియమించడం పట్ల నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సర్వత్ర హర్షం వ్యక్తమవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సీనియర్ శాసన సభ్యుడైన బాజిరెడ్డి గోవర్ధన్ను ఆర్టీసీ చైర్మన్గా నియామకం చేయడంతో బీసీ నాయకుడికి తగిన గుర్తింపును ఇచ్చినట్లయ్యిందని నాయకులు పేర్కొన్నారు. సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన గోవర్ధన్కు ఆర్టీసీ చైర్మన్ ఇవ్వడంతో నిజామాబాద్ నియోజకవర్గంలోని నిజామాబాద్, మోపాల్,డిచ్పల్లి, ధర్పల్లి, జక్రాన్పల్లి, సిరికొండ మండలాల్లోనే కాకుండా ఇతర నియోజకవర్గంలోనూ కార్యకర్తలు పటాకులు కాల్చి, స్వీట్లు పంచి సంబురాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమాల్లో ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్. నాయకులు దాసరి ఇందిరాలక్ష్మీనర్సయ్య, రైతు బంధు కమిటీ నాయకులు, పార్టీకి చెందిన అనుబంధ నాయకులు పాల్గొన్నారు.