బీర్కూర్/భిక్కనూర్/దోమకొండ/ లింగంపేట్/ పిట్లం/ మద్నూర్, డిసెంబర్ 31 :
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ దిష్టిబొమ్మను అయ్యప్ప మాలధారులు, భక్తులు దహనం చేశారు. నరేశ్ను వెంటను శిక్షించాలంటూ శనివారం పలు చోట్ల రాస్తారోకోలు నిర్వహించి పీడీ యాక్టు కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీర్కూర్కు చెందిన అయ్యప్ప సేవాసమితి సభ్యులు, గురుస్వాములు, మాలధారులు మండలకేంద్రంలోని గాంధీచౌక్లో బైరి నరేశ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో గురుస్వాములు మాదప్ప, సుధాకర్యాదవ్, సుభాష్, సుధాకర్గౌడ్, నరేశ్, సాగర్, మహేశ్, శివ, శంకర్సింగ్, మాలధారులు పాల్గొన్నారు. భిక్కనూర్లో అయ్యప్ప మాలధారులు బైరి నరేశ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఐకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో భిక్కనూర్ పట్టణ హిందూ యువత తదితరులు పాల్గొన్నారు. దోమకొండలో అయ్యప్ప మాలధారులు బైరి నరేశ్ను కఠినంగా శిక్షించాలని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎస్సై సుధాకర్కు వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో అయ్యప్ప మాలధారులు, భక్తులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్పై చర్యలు తీసుకోవాలని లింగంపేటలో అయ్యప్ప మాలధారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి సభ్యులు రవీందర్గౌడ్, శ్రీకాంత్, శ్రీకాంత్రెడ్డి, సాయిలు, సాయిరాం, సిద్ధ్దాగౌడ్, స్వామి, భాస్కర్గౌడ్, చంద్రమౌళి, శ్రీరాం, దత్తు, కృష్ణ, ఠాగూర్, నవీన్, మహేశ్, సాయిలు, దత్తురాం తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ను కఠినంగా శిక్షించాలని పిట్లం మండలం పోతిరెడ్డిపల్లి హనుమాన్ ఆలయ నిర్వాహకుడు తేజస్వామి డిమాండ్ చేశారు. శనివారం బాన్సువాడ-పిట్లం రహదారిపై నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, తండావాసులు పాల్గొన్నారు. అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ను వెంటనే శిక్షించాలంటూ అయ్యప్ప మాలధారులు మద్నూర్ మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారు. కార్యక్రమంలో గురుస్వాములు హన్మాండ్లు, రాజు, లక్ష్మణ్, గంగాధర్, రఘు, సాయిలు, గ్రామస్తులు పాల్గొన్నారు.