మోర్తాడ్, ఏప్రిల్ 28 : మండలంలోని యానాం కాలనీలో గంజా యి సేవిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఏసీపీ ప్రభాకర్రావు తెలిపారు. శుక్రవారం మోర్తాడ్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. యానాం కాలనీలోని తొర్తి భూమేశ్ పాత ఇంటిలో మోర్తాడ్కు చెందిన గాడుదుల రాకేశ్, ఆర్మూర్కు చెందిన దూది రవితేజ, వడ్యాట్కు చెందిన మహమ్మద్ అర్షద్, ఆర్మూర్ నివాసి ప్రస్తుతం మోర్తాడ్లో ఉంటున్న తోపారం శశిశేఖర్తో పాటు మరో బాలుడు గంజాయి సేవిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్సై ముత్యంరాజు దాడి చేశారన్నారు.
వీరి నుంచి 500 గ్రాముల గంజాయి, నాలుగు సెల్ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీరు ఆరునెలలుగా గంజాయి సేవిస్తున్నారని, వీరు ఆదిలాబాద్ ప్రాంతానికి చెందిన గుర్తుతెలియని వ్యక్తుల వద్ద నుంచి ఎండుగంజాయి కొనుగోలు చేసి మోర్తాడ్లో యువకులకు ఎక్కువ డబ్బులకు అమ్మడం, గంజాయి సేవించడం అలవాటుగా మార్చుకున్నారని తెలిపారు. ఈ కేసులో ఎస్సై ముత్యంరాజు, సిబ్బంది బాలాజీ, నా రాయణ, సాయికుమార్, అక్బర్, నర్సయ్యలను ఏసీపీ అభినందించారు. వీరికి రివార్డులు ఇప్పించనున్నట్లు చెప్పారు. సమావేశంలో భీమ్గల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ముత్యంరాజులు పాల్గొన్నారు.