వర్ని, నవంబర్ 5 : రాబోయే మిర్గంలోగా సిద్ధాపూర్ రిజర్వాయర్ నీటిని కాలువల ద్వారా రైతులకు సాగునీరందిస్తామని బీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి తండా వాసులకు హామీ ఇచ్చారు. బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తరువాత వర్ని మండలంలో పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం తొలిసారి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలంలోని సిద్ధాపూర్, భీమునిగుట్ట, శ్యాంరావ్ తండా, కోకల్దాస్ తండా, గుంటూరు క్యాంపు, చింతల్పేట్ తండా, పైడిమల్ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనన్నారు. కేవలం 10 సంవత్సరాల్లో తండాల రూపు రేఖలు మార్చేశామని, మరోసారి అవకాశమిస్తే మిగిలిన సమస్యలు కూడా పరిష్కరిస్తామన్నారు. సిద్ధాపూర్ రిజర్వాయరు ద్వారా వర్ని, బాన్సువాడ, గాంధారి తదితర మండలాల్లోని 14 వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. సిద్ధాపూర్ రిజర్వాయర్లో భూములు కోల్పోయిన రైతులకు తిరిగి భూములు ఇప్పించేందుకు కృషిచేస్తామన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక మిగతా వారికి కూడా పోడు భూముల పట్టాలు అందజేస్తామని అన్నారు. కోకల్దాస్ తండా వాసులు తాము బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి మాత్రమే మద్దతు తెలుపుతామని ఏకగ్రీవ తీర్మానం అందజేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి గిరిజనులతో కలిసి డప్పు కొడుతూ ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహేశ్(22) కుటుంబ సభ్యులను పోచారం పరామర్శించి ఎన్నికల తరువాత ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, వర్ని జడ్పీటీసీ సభ్యుడు బర్దావల్ హరిదాస్, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, మండల కో ఆప్షన్ సభ్యుడు కరీం, ఏఎంసీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, సర్పంచులు బర్దావల్ కలియాబాయి దశరథ్, బర్త్యా నాయక్, మండల రైసస అధ్యక్షుడు గంగారాం, సహకార సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మేక వీర్రాజు, కల్లాలి గిరి, కిషన్ నాయక్ పాల్గొన్నారు.
బాన్సువాడ రూరల్/మోస్రా (చందూర్)/బాన్సువాడ/ బాన్సువాడ టౌన్/రుద్రూర్, నవంబర్ 5 : బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఆదివారం బాన్సువాడ మండలంలోని వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎన్నికల ప్రచారంలో ఎంపీపీ దొడ్ల నీరజ, జడ్పీటీసీలు పద్మ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు మోహన్నాయక్, రాజేశ్వర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ నెర్రె నర్సింహులు, బోర్లం, బుడ్మి, సొసైటీ అధ్యక్షులు గంగుల గంగారాం, సంగ్రాం నాయక్, నాయకులు గోపాల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, వెంకటరమణ, కుమ్మరి రాజు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బాన్సువాడ మండలంలో ని బోర్లం క్యాంపులో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. మోస్రా మండల కేంద్రంలో కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ పోచారం శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని ప్రచారం చేశారు. లక్ష మెజారిటీతో పోచారం గెలుస్తున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాన్సువాడ పట్టణంలోని ఐదో వార్డులో బీఆర్ఎస్ పార్టీ వార్డు ఇన్చార్జి అందె రాజు, చిరంజీవి, తాడ్కోల్ రాజు తదితరులు ప్రచారం నిర్వహించారు. బీర్కూర్లో పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎంపీపీ రఘు, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, లాడేగాం గంగారాం, అంజాగౌడ్, ఎంపీటీసీ సభ్యుడు సందీప్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్ మండలం చిక్కడ్పల్లిలో బీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఇంటింట ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ గ్రామాధ్య క్షుడు మోహన్, రైతు బంధు సమితి గ్రామాధ్యక్షుడు హన్మంతు, సీనియర్ నాయకులు మల్లేశ్, రాజయ్య తదితరులు ఉన్నారు. బాన్సువాడ పట్టణంలోని ఏడో వార్డులో స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.
నస్రుల్లాబాద్, నవంబర్ 5 : భవిష్యత్తులో మన గ్రామాలు ఇంకా బాగుపడాలంటే మనమందరం కారు గుర్తుకు ఓటు వేసి బాన్సువాడ అసెంబ్లీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్రెడ్డి భారీ మెజారీటీతో గెలిపించాలని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్ మండలంలోని నెమ్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆదివారం ఇంటింటా ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను మహిళలకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ విఠల్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సాయిలు, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు మాజీద్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రాము, నాయకులు ప్రతాప్ సింగ్, కిశోర్ యాదవ్, భూమేశ్, నాయిని హన్మాండ్లు, ప్రభాకర్రెడ్డి, వీరారెడ్డి, కంది మల్లేశ్, భాస్కర్, అంజాగౌడ్, రంజిత్, సుభాష్, గంగారాం పాల్గొన్నారు.