ఖలీల్వాడి, ఏప్రిల్ 28: జిల్లా కేంద్రంలోని నాందేవ్వాడలో ఉన్న ఎస్టీ ప్రభుత్వ వసతి గృహంలో కుళ్లిన కూరగాయలతో వంట చేస్తున్నారని, నాణ్యత లేని భోజనం పెడుతున్నారంటూ విద్యార్థులు ఆదివారం ఆందోళన చేపట్టారు. ధర్నాచౌక్ వద్ద కూరగాయలను రోడ్లపై పారబోసి నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా భోజనం లో నాణ్యత కొరవడిందన్నారు. కుళ్లిన కూరగాయలతో వంటచేస్తుండడంపై నిర్వాహకులను అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండని చెబుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆందోళన చేపట్టిన విద్యార్థులను పోలీసు అధికారులు సముదాయించి అక్కడి నుంచి పంపించారు.